Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరే... నా పెళ్లామే కావాల్రా నీకు... పట్టపగలే యువకుడి దారుణ హత్య

వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చిత్తూరు జిల్లా నారాయణవనంకు సమీపంలోని మిట్టనైనారు కండ్రిగలో జరిగిన ఈ వివరాలను పరిశీల

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (14:25 IST)
వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చిత్తూరు జిల్లా నారాయణవనంకు సమీపంలోని మిట్టనైనారు కండ్రిగలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మిట్టనైనారు కండ్రిగకు చెందిన పి.షణ్ముగం (23) అనే యువకుడు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి భార్యతోపాటు ఆ యువకుడిని కూడా హెచ్చరించాడు. 
 
అయినప్పటికీ వారిద్దరిలో మార్పు రాకపోవడంతో షణ్ముగాన్ని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన ప్లాన్‌లో భాగంగా, షణ్ముగంను గురువారం ఉదయం 10 గంటలకు పుత్తూరు సమీపంలోని రెండు చెరువుల కట్ట వద్దకు ఫోన్ చేసి పిలిపించాడు. అప్పటికే అక్కడ వేచివున్న మరికొందరితో కలిసి షణ్ముగంపై మారణాయుధాలతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు షణ్ముగం ఎంతగానో ప్రయత్నించాడు. 
 
అయినప్పటికీ ఫలితం లేదని గ్రహించిన షణ్ముగం తన పరిస్థితిని ఫోన్ చేసి గ్రామంలోని తన స్నేహితులకు చేరవేశాడు. విషయం తెలుసుకున్న అతని స్నేహితులు అక్కడకు చేరుకునేలోపు షణ్ముగం ప్రాణాలు కోల్పోయాడు. షణ్ముగం పొత్తి కడుపు, ఛాతి తదితర చోట్ల కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments