Webdunia - Bharat's app for daily news and videos

Install App

హృదయ విదారక ఘటన.. కన్నీళ్లు ఆపతరమా?

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (16:32 IST)
సృష్టిలో అమ్మను మించిన వారు లేరు. ఆజన్మాంతం కన్నబిడ్డలపై ప్రేమానురాగాలు కురిపిస్తూ కంటికి రెప్పలా కాపాడుతుంది అమ్మ. మనుషులకైనా, మూగ ప్రాణులకైనా అమ్మ ప్రేమ ఒకటే. ప్రాణం పోతున్నా తన బిడ్డల కోసమే తల్లి ఆలోచిస్తోంది. అలాంటి సంఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది.
 
ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయినా.. లేగదూడ ఆకలి తీర్చింది ఓ గోమాత. ఈ హృదయవిదారకమైన ఘటన గంగవరం మండలంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గాంధీనగర్‌ గ్రామ సమీప పొలాల వద్ద కృష్ణమూర్తి, లక్ష్మీనారాయణ అనే రైతులు తమ పశువులను రాత్రివేళలో గొడ్లపాకలో కట్టేసేవారు. 

ఆదివారం అర్థరాత్రి సమయంలో అటవీ ప్రాంతంలోని పొలాల మీదుగా వచ్చిన ఏనుగులు గొడ్లపాకలో ఉన్న ఆవు, దూడలపై దాడి చేశాయి. ఏనుగు తొండంతో దూడను తీవ్రంగా గాయపరచడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఆవు నడుము విరిగిపోవడంతో అక్కడి నుంచి లేవలేని స్థితికి చేరుకుంది. 
 
ఆ బాధను తట్టుకోలేక సోమవారం ఉదయం మరణించింది. ఆ విషయం తెలియని నెలన్నర వయస్సున్న లేగదూడ పాల కోసం తాపత్రయపడింది. కాసేపు తల్లి ఆవు వద్ద పాలు తాగి ఆకలి తీర్చుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన పలువురు కంటతడి పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments