Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడు ప్రచారం చేయమని అడగలేదు.. ప్రచారానికి పిఠాపురం వెళ్లడం లేదు : చిరంజీవి

ఠాగూర్
శుక్రవారం, 10 మే 2024 (15:15 IST)
తన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయాలని తనను కోరలేదని అందువల్ల తాను పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళడం లేదని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసిన రెండో అత్యున్నత పురస్కారమైన "పద్మవిభూషణ్" అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకుని శుక్రవారం హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని చెప్పారు. 
 
తాను తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిఠాపురానికి తాను రావాలని కళ్యాణ్ కోరుకోడన్నారు. కళ్యాణ్ బాబు ఎపుడూ బాగుండాలని, జీవితంలో అనుకున్నవి సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. మా తమ్ముడు రాజకీయంగా ఎదగాని మా కుటుంబం మనస్పూర్తిగా కోరుకుంటుందని చెప్పారు. స్వర్గీయం ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఆయన కోరారు. తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్‌కు భారత రత్న పురస్కారం ఇచ్చినపుడు ఎన్టీఆర్‌కు కూడా ఈ పురస్కారం ఇవ్వడం సబబన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments