Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారు : పేర్ని నాని

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (18:01 IST)
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పెద్దన్నయ్య చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన్ను తెలుగు సినీ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు కలిశారు. 
 
ఈ సమావేశం ముగిసిన తర్వాత పేర్ని నాని మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ పిచ్చి వాగుడుకి, తమకు సంబంధం లేదని చెప్పడానికే తన వద్దకు నిర్మాతలు వచ్చారన్నారు. పైగా, ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు చిత్రపరిశ్రమకు సంబంధం లేదన్నారు. 
 
అలాగే, పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. కిరాయికి పని చేసేది ఎవరో అందరికీ తెలుసని... జనసేన ఒక కిరాయి పార్టీ అంటూ విమర్శించారు. 
 
రాజకీయ పార్టీని పవన్ కల్యాణ్ ఒక టెంట్ హౌస్‌లా అద్దెకు ఇస్తుంటారని ఎద్దేవా చేశారు. ఆన్‌లైన్ సినిమా టికెట్లను అమ్మే విధానం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్‌కు సినీ పరిశ్రమ అనుకూలంగా ఉందని చెప్పారు. సినిమా టికెట్లపై నిర్దిష్టమైన విధానం అవసరమని మంత్రి పేర్ని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments