Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశా కేసు : ఆడపిలల్లకు చిరంజీవి అడ్వైజ్ (వీడియో)

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (11:09 IST)
హైదరాబాద్, శంషాబాద్​ పశు వైద్యురాలి అత్యాచార ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందిచారు. ఈ ఘటన తన మనసును కలచివేసిందని, ఇలాంటి మగమృగాల మధ్యా మన ఆడవాళ్లు బతికేది? అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

'గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగమృగాల మధ్యా మనం బతుకుతోంది.. అనిపిస్తోంది. మనసు కలచివేసిన ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఓ తండ్రిగా స్పందిస్తున్నాను. 
 
ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పు లేదు. త్వరగా నేరస్థులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవరైనా భయపడతారు' అని చెప్పుకొచ్చారు. 
 
'మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆడపిల్లలందరికీ నేను చేప్పేది ఒకటే. మీ ఫోనులో 100 నెంబరును స్టోర్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మీ స్మార్ట్ ఫోనులో హాక్​ ఐ యాప్​ను డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క బజర్ నొక్కితే చాలు.. షీ టీమ్స్ హుటాహుటిన మిమ్మల్ని చేరుకుంటాయి. పోలీసు వారి సేవలను.. అలాగే వారి టెక్నాలజీని మీరు వినియోగించుకోండి' అంటూ చిరంజీవి మహిళలకు సలహా ఇచ్చారు. 
 
కాగా, ప్రియాంకా రెడ్డి హత్య కేసుపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ ఘటనను ఖండించారు.
 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments