బాబు ముందు బోరున విలపించిన అయ్యన్నపాత్రుడు... ఎందుకు?

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (17:24 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా వైపు మొగ్గు చూపడాన్ని టీడీపీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఓటమిని తలచుకుని టీడీపీ నేతలు ఇప్పటికీ కంటతడిపెడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు కంటతడి పెట్టడం. 
 
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగింది. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులంతా హజరయ్యారు. 
 
ఈ సమావేశానికి హాజరైన అయ్యన్నపాత్రుడు ఓ దశలో తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో శ్రమించినా ఫలితం లేకపోయిందంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. 
 
ఎన్నో ప్రజా సంక్షేమ పనులు చేపట్టామని, నేతలందరూ తీవ్రంగా కష్టించారని, అయినాగానీ ప్రజలు వైసీపీ పట్ల ఆకర్షితులవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన చంద్రబాబుతో పేర్కొన్నారు.
 
ముఖ్యంగా, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు మూతపడిన స్థితిలో దర్శనమివ్వడాన్ని చూడలేక పోతున్నామంటూ అయ్యన్న కంటతడి పెట్టడం పార్టీ వర్గాలను కూడా కదిలించింది. ఆయన్ను పార్టీ అధినేతతో పాటు.. ఇతర సభ్యులు ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments