Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబేడు మార్కెట్ ఎఫెక్టు : గ్రీన్ జోను సూళ్లూరుపేటలో 5 కేసులు

Webdunia
సోమవారం, 11 మే 2020 (10:51 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా హాట్ స్పాట్ కేంద్రంగా చెన్నై కోయంబేడు మార్కెట్ నిలిచింది. ఫలితంగా తమిళనాడులో ప్రతి రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అంతేనా.. తమిళనాడు వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఈ కోయంబేడు మార్కెట్ అని తేలింది. ముఖ్యంగా, చెన్నై మహానగరం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ జోనుగా ఉన్న సూళ్లూరు పేటలో కూడా ఐదు కరోనా పాజిటివ్ కేసులు రావడానికి ప్రధాన కారణం ఈ కోయంబేడు మార్కెట్టేనని తేలింది. ఈ వైరస్ సోకినవారంతా కూరగాయల చిరు వ్యాపారులే కావడం గమనార్హం. 
 
లాక్‌డౌన్ వేళ సూళ్ళూరు పేటలోని సాయినగర్, వనంతోపు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసి, వాటిని తీసుకొచ్చి తమ ప్రాంతాల్లో విక్రయించారు. ఫలితంగా ఈ రెండు ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ రెండు ప్రాంతాలను పూర్తిగా దిగ్బంధించారు. ఈ ప్రాంతాలకు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments