Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబేడు మార్కెట్ ఎఫెక్టు : గ్రీన్ జోను సూళ్లూరుపేటలో 5 కేసులు

Webdunia
సోమవారం, 11 మే 2020 (10:51 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా హాట్ స్పాట్ కేంద్రంగా చెన్నై కోయంబేడు మార్కెట్ నిలిచింది. ఫలితంగా తమిళనాడులో ప్రతి రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అంతేనా.. తమిళనాడు వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఈ కోయంబేడు మార్కెట్ అని తేలింది. ముఖ్యంగా, చెన్నై మహానగరం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ జోనుగా ఉన్న సూళ్లూరు పేటలో కూడా ఐదు కరోనా పాజిటివ్ కేసులు రావడానికి ప్రధాన కారణం ఈ కోయంబేడు మార్కెట్టేనని తేలింది. ఈ వైరస్ సోకినవారంతా కూరగాయల చిరు వ్యాపారులే కావడం గమనార్హం. 
 
లాక్‌డౌన్ వేళ సూళ్ళూరు పేటలోని సాయినగర్, వనంతోపు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసి, వాటిని తీసుకొచ్చి తమ ప్రాంతాల్లో విక్రయించారు. ఫలితంగా ఈ రెండు ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ రెండు ప్రాంతాలను పూర్తిగా దిగ్బంధించారు. ఈ ప్రాంతాలకు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments