Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో చిరుత, అక్కడే కూర్చుని భక్తులపై దాడి చేస్తోంది, ఎక్కడ?

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (17:23 IST)
శేషాచలం అటవీ ప్రాంతం అంటేనే ఎన్నో క్రూరమృగాలు ఉంటాయి. ముఖ్యంగా చిరుతలు, ఏనుగులు, మిగిలిన జంతువులన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే జనసంచారం పెద్దగా తిరుమలలో లేకపోవడంతో జంతువులన్నీ రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత తిరుపతిలోని రెండవ ఘాట్ రోడ్డులో ప్రత్యక్షమైంది.
 
మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై వెళుతున్న వాహనదారుడిపై అలిపిరి టోల్ గేట్ నుంచి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో దాడి చేసింది. ఆ తరువాత అక్కడే కూర్చుండి పోయింది. మరో ఇద్దరు వేర్వేరు ద్విచక్రవాహనాల్లో వెళుతుండగా వారి మీద కూడా దాడి చేసింది. ఎలాగోలా వారు తప్పించుకుని తిరుమలకు చేరుకున్నారు.
 
కానీ చిరుత మాత్రం అదే ప్రాంతంలో కూర్చుని ఉంది. అలిపిరి టోల్ గేట్ నుంచి సరిగ్గా నాలుగుకిలోమీటర్ల దూరంలో చిరుత ఉందట. దీంతో విషయం కాస్త టిటిడితో పాటు అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది. అటవీశాఖాధికారులు రంగంలోకి దిగారు.
 
చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వాహనాలను మాత్రం యధావిధిగా ఘాట్ రోడ్డులో పంపించేస్తున్నారు. ఐదు, ఆరు వాహనాలను ఒకేసారి తిరుమలకు అనుమతిస్తున్నారు. మరోసారి చిరుత సంచారం శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్ చిత్రం లేటెస్ట్ అప్ డేట్

తెలుగు అమ్మాయిలంటే అంత సరదానా! ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ పై మండిపాటు

నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments