Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి వెళ్లాలి అనుమతివ్వండి : డీజీపీకి చంద్రబాబు లేఖ

Webdunia
ఆదివారం, 24 మే 2020 (14:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సివుందని, అందువల్ల తనకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. నిజానికి కరోనా లాక్డౌన్‌కు ముందు చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్లారు. ఇంతలో లాక్డౌన్ ప్రకటించండంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 
 
ఈ క్రమంలో లాక్డౌన్ ఆంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలించాయి. దీంతో ఏపీకి వెళ్లేందుకు తనకు అనుమతించాలని చంద్రబాబు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి లభించింది. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దాన్ని పెండింగ్‌లో పెట్టింది. తాను హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లి, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శిస్తానని ఏపీ డీజీపీకి లేఖ రాస్తూ, ఆపై ఆన్‌లైనులో రెండు రాష్ట్రాల డీజీపీలనూ అనుమతి కోరారు.
 
తెలంగాణ డీజీపీ కార్యాలయం వెంటనే అనుమతి మంజూరు చేయగా, ఏపీ డీజీపీ కార్యాలయం ఇంకా స్పందించలేదు. తాను సోమవారం ఉదయం 10.35 గంటలకు బయలుదేరి విశాఖ వెళతానని చంద్రబాబు తన దరఖాస్తులో కోరారు. విశాఖలో బాధితులను పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గాన అమరావతి చేరుకుంటానని ఆ లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments