Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజెపికి దగ్గరయ్యేందుకేనా బాబు ఆరాటం..?

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (15:05 IST)
అమరావతి సభలో అన్ని పార్టీల నాయకులు ఒకే వేదికనై కనిపించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మీటింగ్ లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చంద్రబాబు ఏం మాట్లాడుతారోనన్న ఆసక్తి అందరిలోను నెలకొంది. పార్టీలకతీతంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి అమరావతి రైతుల కోసం చివరి వరకు ఎవరు వస్తారోనన్న ఉత్కంఠ కూడా కనిపించింది.

 
అయితే నిన్న సాయంత్రం జరిగిన సభలో చంద్రబాబు బిజెపి నేతలపైన ప్రత్యేక శ్రద్థ చూపించారు. బిజెపి రాష్ట్ర మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు బిజెపి ముఖ్య నేతలందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. సభకు సంఘీభావం తెలుపుదామని.. అందరూ సభాస్థలిపైనే లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి సంఘీభావం తెలిపారు.

 
అయితే బిజెపి నేతలను పక్కకు తోసేసి మిగిలిన పార్టీల నేతలు ముందుకు వచ్చేశారు. దీంతో గమనించిన చంద్రబాబు బిజెపి వారు కనిపించలేదే. వారిని తోసేస్తున్నారు. జరగండి.. జరగండి అంటూ అందరినీ వెనక్కి పంపించి బిజెపి నేతలను ముందుకు పంపారు. 

 
దీంతో చంద్రబాబు బిజెపితో దోస్తీ కోసం పాకులాడుతున్నట్లు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న జమిలీ ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగితేనే ఉపయోగం ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట. దీంతో ఇప్పటి నుంచే బిజెపికి దగ్గరయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments