Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుళ్లిపోయిన కోడి గుడ్లను పెట్టి విద్యార్థులను ఆసుపత్రులపాలు చేస్తారా?

కుళ్లిపోయిన కోడి గుడ్లను పెట్టి విద్యార్థులను ఆసుపత్రులపాలు చేస్తారా?
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 17 డిశెంబరు 2021 (10:39 IST)
కుళ్లిపోయిన కోడి గుడ్లను పెట్టి విద్యార్థులను ఆసుపత్రిపాలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, ప్రతి విద్యార్థికి పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద వేల కోట్ల రూపాయల నిధులను అందిస్తుంటే, మీరు కుళ్లిపోయిన కోడిగుడ్లను విద్యార్థులకు పెడుతున్నారని విమర్శించారు. 
 
 
విద్యార్థుల‌కు పౌష్టికాహారం అందించి, వారు చ‌దువులో రాణించేందుకు కేంద్రం మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌ని సోము వీర్రాజు చెప్పారు. కుళ్లిపోయిన గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై, కుళ్లిపోయిన గుడ్లతో వంట వండే వారిపై చర్యలు తీసుకుని మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సీఎం జగన్ ను కోరుతున్నానని చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్ కు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగలేఖ రాశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్న ధర్మపురి శ్రీనివాస్