Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జ‌గ‌న్ క్రైస్తవాన్ని అనుసరించడం వ‌ల్లే... అంద‌రిపై స‌మ దృష్టి!

సీఎం జ‌గ‌న్ క్రైస్తవాన్ని అనుసరించడం వ‌ల్లే... అంద‌రిపై స‌మ దృష్టి!
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 14 డిశెంబరు 2021 (10:55 IST)
జగన్ పాలనలో రాజ్యాంగ ఫలాలను అందరికి సమానంగా అందించే ఆలోచన వెనుక అసలు రహాస్యం ఏపీ ముఖ్యమంత్రి క్రైస్తవంను అనుసరించడమే అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వివ‌రించారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల‌కు ముఖ్య అతిధిగా హాజరైన హోం మంత్రి మాట్లాడుతూ, సీఎం జ‌గ‌న్ సుచరిత హిందువు అయినా క్రైస్త‌వాన్ని అనుస‌రిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.
 
 
క్రైస్తవంను అనుసరించటం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఫలాలను సమానంగా అందించగలిగే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ కు కలిగిందని ఆమె తెలిపారు. కులం వేరు, మతం వేరు,  ఎవరైనా వారి వారి విశ్వాసం అనుసారం మత మార్పిడి చేసుకోవచ్చని హోం మంత్రి సుచరిత చెప్పారు. 

 
ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్ సర్కార్ కే చెల్లిందన్న సుచరిత, క్రీస్తు బోధ‌న‌ల‌ను అనుస‌రించిన వారికి క‌ష్టాలు ఉండ‌వ‌ని, స్వ‌స్థ‌త చేకూరుతుంద‌ని పేర్కొన్నారు.  క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సుచ‌రిత పాల్గొని, ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోనేషియా మౌమెరికి సమీపంలో భారీ భూకంపం