Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఉపఎన్నికపై సీఈసీకి చంద్రబాబు లేఖ

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (19:04 IST)
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి, కేంద్ర బలగాలతో తిరిగి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు.

ఈ మేరకు శుక్ర‌వారం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)కి ఆయన లేఖ రాశారు. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో జరిగిన అక్రమాలపై తగు చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని లేఖలో పేర్కొన్నారు.

తిరుపతి ఉపఎన్నికలో స్థానికేతరులు వేలకొద్ది దొంగ ఓట్లు వేశారని.. వారిని అరికట్టడంలో పోలీసులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తిరుపతిలో తిష్టవేసి ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న స్థానికేతరుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు.

దొంగ ఓట్లు వేస్తున్న వారిని పట్టించిన తెదేపా శ్రేణులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అక్రమాలకు సంబంధించిన వీడియో, ఫొటో ఆధారాలను తన లేఖతో పాటు జతచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments