Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు వేలికి రింగ్.. ఆ రింగ్‌లో ఉన్న రహస్యమేంటి?

Webdunia
గురువారం, 7 జులై 2022 (17:25 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చూపుడు వేలికి ప్లాటినం రింగ్ వచ్చి చేరింది. ఈ రింగులోని రహస్యాలను ఆయన వెల్లడించారు. అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లిలో జరిగిన టీడీపీ మినీ మహానాడుకు హాజరైన సందర్భంగా ఈ ప్లాటినం ఉంగరం వెలుగుచూసింది. దీనిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొనడంతో సమావేశం తర్వాత జరిగిన పార్టీ నేతల సమీక్షా సమావేశంలో ఈ ఉంగరం ప్రత్యేకతను చంద్రబాబు వివరించారు. 
 
తన వేలికి ప్లాటినం ఉంగరం కొత్తగా పెట్టుకున్న నిజమేనని, ఇది కేవలం ఉంగరం మాత్రమే కాదన్నారు. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు తెలియజేసే పరికరమని చెప్పారు. ప్లాటినం ఉంగరంలో ఓ చిప్ ఉంటుందని, అది తన హార్ట్ బీట్, స్లీపింగ్ అవర్స్, ఆహారం, తదితర అంశాలన్నింటినీ రికార్డు చేస్తుందని తెలిపారు. ఆ వివరాలను ప్లాటినం ఉంగరం ఎప్పటికపుడు తన కంప్యూటర్‌కు పంపుతుందని కూడా ఆయన వెల్లడించారు. 
 
రోజూ నిద్రలేచిన తర్వాత కంప్యూటర్‌కు పంపిన రిపోర్టును చెక్ చేసుకుంటానని, అందులో రోజువారీగా చేయాల్సిన చర్యల్లో ఏదేని తప్పులు దొర్లివున్నట్టయితే దాన్ని సరిదిద్దుకుని, మరుసటి రోజు ఆ తప్పు జరుగకుండా చూస్తానని చెప్పారు. అలాగే, పార్టీ కార్యకర్తలు కూడా ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments