Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలు ఆస్పత్రిలో శవాలను పీక్కుతింటున్న కుక్క!!?? (Video)

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయే రోగుల పరిస్థితి మరింత దయనీంగా మారుతోంది. జిల్లా కేంద్రంలోనే ఉండే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా రోగులు అష్టకష్టాలుపడుతున్నారు. ఒకవేళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయే కరోనా రోగుల మృతదేహాలను తరలించేందుకు ఆస్పత్రి సిబ్బంది సైతం సాహసం చేయడం లేదు. దీంతో మృతదేహాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. ఈ హృదయ విదాకర సంఘటనకు సంబంధించి ఓ వీడియోను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
ఒంగోలు ఆస్పత్రిలో ఓ బెడ్ కింద రెండు రోజులుగా పడి ఉన్న మృతదేహం వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. దీన్ని చూస్తుంటే హృదయం బద్దలవుతోందన్నారు. సిబ్బంది ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని... రెండు రోజులుగా నేలపై మృతదేహం పడి ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. 
 
శవాన్ని కుక్కులు పీక్కుతుంటున్నాయని పేర్కొన్నారు. మానవతా విలువలకు తూట్లు పొడిచేలా వ్యవహరించారని... ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. ఈ ఘటనను ఖండించడానికి కూడా మాటలు రావడం లేదని అన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకోవడంతో రోజుకు పదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments