Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలు ఆస్పత్రిలో శవాలను పీక్కుతింటున్న కుక్క!!?? (Video)

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయే రోగుల పరిస్థితి మరింత దయనీంగా మారుతోంది. జిల్లా కేంద్రంలోనే ఉండే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా రోగులు అష్టకష్టాలుపడుతున్నారు. ఒకవేళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయే కరోనా రోగుల మృతదేహాలను తరలించేందుకు ఆస్పత్రి సిబ్బంది సైతం సాహసం చేయడం లేదు. దీంతో మృతదేహాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. ఈ హృదయ విదాకర సంఘటనకు సంబంధించి ఓ వీడియోను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
ఒంగోలు ఆస్పత్రిలో ఓ బెడ్ కింద రెండు రోజులుగా పడి ఉన్న మృతదేహం వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. దీన్ని చూస్తుంటే హృదయం బద్దలవుతోందన్నారు. సిబ్బంది ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని... రెండు రోజులుగా నేలపై మృతదేహం పడి ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. 
 
శవాన్ని కుక్కులు పీక్కుతుంటున్నాయని పేర్కొన్నారు. మానవతా విలువలకు తూట్లు పొడిచేలా వ్యవహరించారని... ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. ఈ ఘటనను ఖండించడానికి కూడా మాటలు రావడం లేదని అన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకోవడంతో రోజుకు పదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments