17 నుంచి టీడీపీ చీఫ్ చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన

Webdunia
మంగళవారం, 16 మే 2023 (08:24 IST)
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, 17న పెందుర్తి, 18న ఎస్.కోట, 19న అనకాపల్లిలలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. మొత్తం మూడు రోజుల పాటు "ఇదేం ఖర్మ రాష్ట్రానికి" అనే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 
 
ఇందుకోసం ఆయన ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 3.45 గంటలకు చంద్రబాబు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4.45 గంటలకు పెందుర్తి సమీపంలోని మహిళా ప్రాంగణం వద్దకు చేరుకుని పంచ గ్రామాల సమస్యపై వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఐదు గంటలకు మహిళా ప్రాంగణం జంక్షన్ నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది.
 
పెందుర్తి జంక్షన్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం సరిపల్లి వద్ద బస్సులో బస చేస్తారు. 18వ తేదీ ఉదయం బస్సు వద్ద టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం స్థానిక నేతలతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12 గంటలకు మత్స్యకారులతో సమావేశమవుతారు. 330 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి ఎస్.కోట వెళతారు. అక్కడ రోడ్, అనంతరం బహిరంగ సభల్లో పాల్గొన్న అనంతరం ఆరోజు రాత్రి స్థానిక రిసార్టులో బస చేస్తారు.
 
19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రిసార్ట్స్ నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు అనకాపల్లి సమీపంలోని శంకరం జంక్షన్‌కు చేరుకుంటారు. అక్కడ నల్లబెల్లం రైతుల నుంచి వినతిపత్రం స్వీకరిస్తారు. అనంతరం రోడ్ షో నిర్వహిస్తారు. నాలుగురోడ్ల కూడలి మీదుగా 6.30 గంటలకు నెహ్రూ చౌక్‌కు చేరుకుని ఆ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించి రాత్రి 8 గంటలకు బయలుదేరి 9 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకుని విజయవాడ వెళతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments