నేటి నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (09:43 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి ఈ నెల 6వ తేదీ వరకు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. అలాగే కుప్పంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానిక టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లుచేశాయి. 
 
ఈ పర్యటన కోసం ఆయన ఉదయం 9.25గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 11.20 గంటలకు బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2.30 గంటలకు కుప్పంకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామం చేరుకుంటారు. రాత్రి 8 గంటల వరకు శాంతిపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటిస్తారు.
 
ఈ నెల 5వ తేదీన కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఆ రాత్రికి కుప్పం ఆర్ అండ్బి గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 6వ తేదీన గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. సాయంత్రం 6 గంటలకు పెద్దపర్తికుంట నుంచి బయల్దేరి బెంగుళూరు హెచ్.ఏ.ఎల్. విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి వస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments