Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (09:43 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి ఈ నెల 6వ తేదీ వరకు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. అలాగే కుప్పంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానిక టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లుచేశాయి. 
 
ఈ పర్యటన కోసం ఆయన ఉదయం 9.25గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 11.20 గంటలకు బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2.30 గంటలకు కుప్పంకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామం చేరుకుంటారు. రాత్రి 8 గంటల వరకు శాంతిపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటిస్తారు.
 
ఈ నెల 5వ తేదీన కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఆ రాత్రికి కుప్పం ఆర్ అండ్బి గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 6వ తేదీన గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. సాయంత్రం 6 గంటలకు పెద్దపర్తికుంట నుంచి బయల్దేరి బెంగుళూరు హెచ్.ఏ.ఎల్. విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి వస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments