Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (09:43 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి ఈ నెల 6వ తేదీ వరకు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. అలాగే కుప్పంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానిక టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లుచేశాయి. 
 
ఈ పర్యటన కోసం ఆయన ఉదయం 9.25గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 11.20 గంటలకు బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2.30 గంటలకు కుప్పంకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామం చేరుకుంటారు. రాత్రి 8 గంటల వరకు శాంతిపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటిస్తారు.
 
ఈ నెల 5వ తేదీన కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఆ రాత్రికి కుప్పం ఆర్ అండ్బి గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 6వ తేదీన గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. సాయంత్రం 6 గంటలకు పెద్దపర్తికుంట నుంచి బయల్దేరి బెంగుళూరు హెచ్.ఏ.ఎల్. విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి వస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments