Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు కంటి సమస్యలు.. ఆపరేషన్ చేయించుకుంటారా?

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (08:44 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చేరారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించారు. 
 
ఆపై డిశ్చార్జ్ అయ్యారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో క్యాటరాక్ట్ సమస్యలకు చంద్రబాబు శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్టు తెలుస్తోంది. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు నాయుడు గురువారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. 
 
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్‌ కే రాజేశ్‌ ఆధ్వర్యంలో జనరల్‌ మెడిసిన్‌తోపాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన వైద్యుల బృందం కాలేయం, మూత్రపిండాల పనితీరు, రక్తం, మూత్ర పరీక్షలు, 2డీ ఎకో, ఈసీజీ, అలర్జీ వంటి పలు పరీక్షలను సూచించింది. చంద్రబాబుకు స్క్రీనింగ్ మొదలైనవి చేశారు. 
 
చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. తీవ్రమైన అలర్జీ, ఇతర వైద్యపరమైన కారణాలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నాయుడు బుధవారం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments