Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఆపేయమన్నదా? ఏపీ సీఎం అలా ఎందుకన్నారు?

కేంద్రానికి తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరుగుతుందా లేదంటే ఏదైనా చిన్న తేడా కారణంగా ఇలా జరిగిందా? ఏదేమైనప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచనం సృష్టిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుతో ఏపీలో రైత

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (19:25 IST)
కేంద్రానికి తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరుగుతుందా లేదంటే ఏదైనా చిన్న తేడా కారణంగా ఇలా జరిగిందా? ఏదేమైనప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచనం సృష్టిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుతో ఏపీలో రైతుల కలలు సాకారమవుతాయని అనుకుంటుంటే, కేంద్రంలోని ఓ ఉన్నతాధికారి పోలవరం ప్రాజెక్టు కోసం పిలిచిన టెండర్లను ఆపేయాలంటూ తమకు లేఖ రాశారన్నారు. 
 
ఈ లేఖతో పోలవరం ప్రాజెక్టు పనులు అయోమయంలో పడ్డాయన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలంటే మూడో పార్టీకి అప్పంగిచాల్సిన పరిస్థితి వున్నదన్నారు. ఒకవేళ కేంద్రమే పోలవరం పూర్తి చేయాలనుకుంటే తాము కూడా సహకరిస్తామని తెలిపారు. ఇదిలావుంటే పోలవరం ప్రాజెక్టులో భాగంగా 60 వేల ఎకరాల భూములను సేకరించాల్సి వుందని అన్నారు. 
 
ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చిన లేఖతో గందరగోళం తలెత్తిందనీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విదేశీ ప్రయాణం ముగించుకుని రాగానే ఆయనతో భేటీ అవుతామన్నారు. పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments