Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఆపేయమన్నదా? ఏపీ సీఎం అలా ఎందుకన్నారు?

కేంద్రానికి తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరుగుతుందా లేదంటే ఏదైనా చిన్న తేడా కారణంగా ఇలా జరిగిందా? ఏదేమైనప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచనం సృష్టిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుతో ఏపీలో రైత

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (19:25 IST)
కేంద్రానికి తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరుగుతుందా లేదంటే ఏదైనా చిన్న తేడా కారణంగా ఇలా జరిగిందా? ఏదేమైనప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచనం సృష్టిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుతో ఏపీలో రైతుల కలలు సాకారమవుతాయని అనుకుంటుంటే, కేంద్రంలోని ఓ ఉన్నతాధికారి పోలవరం ప్రాజెక్టు కోసం పిలిచిన టెండర్లను ఆపేయాలంటూ తమకు లేఖ రాశారన్నారు. 
 
ఈ లేఖతో పోలవరం ప్రాజెక్టు పనులు అయోమయంలో పడ్డాయన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలంటే మూడో పార్టీకి అప్పంగిచాల్సిన పరిస్థితి వున్నదన్నారు. ఒకవేళ కేంద్రమే పోలవరం పూర్తి చేయాలనుకుంటే తాము కూడా సహకరిస్తామని తెలిపారు. ఇదిలావుంటే పోలవరం ప్రాజెక్టులో భాగంగా 60 వేల ఎకరాల భూములను సేకరించాల్సి వుందని అన్నారు. 
 
ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చిన లేఖతో గందరగోళం తలెత్తిందనీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విదేశీ ప్రయాణం ముగించుకుని రాగానే ఆయనతో భేటీ అవుతామన్నారు. పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments