పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఆపేయమన్నదా? ఏపీ సీఎం అలా ఎందుకన్నారు?

కేంద్రానికి తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరుగుతుందా లేదంటే ఏదైనా చిన్న తేడా కారణంగా ఇలా జరిగిందా? ఏదేమైనప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచనం సృష్టిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుతో ఏపీలో రైత

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (19:25 IST)
కేంద్రానికి తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరుగుతుందా లేదంటే ఏదైనా చిన్న తేడా కారణంగా ఇలా జరిగిందా? ఏదేమైనప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచనం సృష్టిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుతో ఏపీలో రైతుల కలలు సాకారమవుతాయని అనుకుంటుంటే, కేంద్రంలోని ఓ ఉన్నతాధికారి పోలవరం ప్రాజెక్టు కోసం పిలిచిన టెండర్లను ఆపేయాలంటూ తమకు లేఖ రాశారన్నారు. 
 
ఈ లేఖతో పోలవరం ప్రాజెక్టు పనులు అయోమయంలో పడ్డాయన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలంటే మూడో పార్టీకి అప్పంగిచాల్సిన పరిస్థితి వున్నదన్నారు. ఒకవేళ కేంద్రమే పోలవరం పూర్తి చేయాలనుకుంటే తాము కూడా సహకరిస్తామని తెలిపారు. ఇదిలావుంటే పోలవరం ప్రాజెక్టులో భాగంగా 60 వేల ఎకరాల భూములను సేకరించాల్సి వుందని అన్నారు. 
 
ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చిన లేఖతో గందరగోళం తలెత్తిందనీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విదేశీ ప్రయాణం ముగించుకుని రాగానే ఆయనతో భేటీ అవుతామన్నారు. పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments