Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీకి పొట్టపొడిస్తే అక్షరం ముక్కరాదు : చంద్రబాబు

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (17:42 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోమారు మాటలతో దాడి చేశారు. నరేంద్ర మోడీ చదువుకోలేదని ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హస్తినలోని జంతర్ మంతర్‌లో నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొని తన సంఘీభావాన్ని తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ సాగిస్తున్న అప్రజాస్వామ్య పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకే తామంతా ఏకమయ్యామన్నారు. మోడీ ఒత్తిడి తట్టుకోలేక ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. 
 
దేశంలోని విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, వారిపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాన వ్యవస్థలన్నింటిని ధ్వంసం చేస్తున్నారనీ, దీంతో ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 
 
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో తప్పుడు అఫిడవిట్‌తో సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించిందన్నారు. ఎక్కడి, ఎవరికి ఇబ్బంది వచ్చినా తామంతా కలిసి ఆందోళన చేశామని, మోడీ నిరంకుశ పాలన నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని, అందుకే తామంతా ఏకమయ్యామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments