Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం సింఘాల్ తెలుగు నేర్చుకున్నారా... ఎవరు?: పవన్ ప్రశ్నలకు నో ఆన్సర్

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తితిదే ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌కు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మూడురోజుల పాటు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు ప్రోటోకాల్ ప్రకారం టిటిడి ఈఓతో పాటు పలువురు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. టిటి

Webdunia
శనివారం, 20 మే 2017 (21:01 IST)
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తితిదే ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌కు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మూడురోజుల పాటు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు ప్రోటోకాల్ ప్రకారం టిటిడి ఈఓతో పాటు పలువురు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. టిటిడి ఈఓను చూసిన చంద్రబాబు ఏమయ్యా... సింఘాల్ తెలుగు నేర్చుకున్నారా అంటూ తమాషాగా మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వేశారు.
 
నీకు ఇక్కడ ఎలా ఉందంటూ ఈఓను ప్రశ్నించారు బాబు. సర్.. ఇక్కడ బాగుందంటూ ఈఓ చంద్రబాబుకు సమాధానమిచ్చారు. ఆ తరువాత ఈఓ భుజం తడుతూ వచ్చేశారు బాబు. టిటిడి ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించినప్పటి నుంచి ఇప్పటివరకు తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. స్వాముల నుంచి, సినీప్రముఖుల వరకు అందరూ ఈఓ నియామకంపై విమర్శలు చేసిన వారే. 
 
ఉత్తరాదికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి టిటిడి లాంటి ప్రముఖ ధార్మిక సంస్ధకు ఈఓగా నియమించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చంద్రబాబునాయుడు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇదే విషయంపై ఏకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించారు. ఉత్తరాదికి చెందిన వ్యక్తిని ఏ విధంగా టిటిడి ఈఓగా నియమిస్తారని బాబు సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు పవన్. అయితే చంద్రబాబు మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానం ఇప్పటివరకు చెప్పనేలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments