Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రం నీ అబ్బ సొత్తా జగన్‌...? విశాఖకు ఏ2 శని పట్టింది.. బాబు ఫైర్

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (16:18 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ నగరంలోని 5 ప్రధాన కూడళ్లలో రోడ్‌షోలు నిర్వహించారు. ముందుగా పెందుర్తి జంక్షన్‌లో రోడ్‌ షోలో ప్రారంభించిన చంద్రబాబు.. అక్కడి నుంచి చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా అక్కయ్యపాలెం వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు.
 
విశాఖకు ఏ2 శని పట్టిందని.. ఆ శనిని వదిలించాల్సిందేన్నారు చంద్రబాబు. ఎంపీ విజయసాయిరెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దాడులతో టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మాండ విజయం అందించాలని కోరారు. 22 నెలల సీఎం జగన్ పాలనలో విశాఖ అభివృద్ధి శూన్యమని చంద్రబాబు తప్పుబట్టారు. ఏపీలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందన్న చంద్రబాబు.. రాష్ట్రం నీ అబ్బ సొత్తా జగన్‌...? అంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఏ1కు ఎప్పుడూ భూములపైనే ధ్యాస అని.. విశాఖలో ఏ2 పెత్తనమేంటని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments