యనమల రామకృష్ణుడు ఓ ధ్వజస్తంభం : చంద్రబాబు

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (15:19 IST)
పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. ఇటీవల మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లుల సమయంలో శాసన మండలిలో యనమల నడుచుకున్న తీరు అద్భుతమని చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై చంద్రబాబు మరోమారు స్పందిస్తూ, శాసనమండలిలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను నిలువరించేందుకు యనమల విశేషంగా కృషి చేశారని కొనియాడారు. కౌన్సిల్‌లో ధ్వజస్తంభంలా నిలిచారని అభినందించారు. మండలిలో టీడీపీ నేతలు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. 1984లో టీడీపీ ధర్మ పోరాటాన్ని ప్రపంచం మొత్తం అభినందించిందని.. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీలకు ఆ అవకాశం వచ్చిందన్నారు. విశ్వసనీయత, విలువలతో నిలబడ్డారని చెప్పుకొచ్చారు.
 
ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు బెదిరింపులు, ప్రలోభాలకు లొంగితే తెరమరుగవుతారని.. త్యాగాలు చేసిన వాళ్లు మాత్రమే ప్రజల గుండెల్లో ఉంటారన్నారు. సీఎం జగన్ చేతిలో మళ్లీ మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. వైసీపీ సర్కార్‌కు చురకలంటించారు. ప్రజలు ఒక్కసారే మోసపోతారని.. పదేపదే అది జరగదన్నారు. జనం గుండెల నుంచి టీడీపీని తుడిపేయడం అసాధ్యమని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments