Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ వస్తే కొంప కొల్లేరే.. మేమొస్తే.. అమరావతి, పోలవరం పూర్తి.. చంద్రబాబు

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:24 IST)
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం, అమరావతి పూర్తి చేస్తామని.. వైకాపా చీఫ్ జగన్‌కు అధికారం ఇస్తే అవన్నీ ఆగిపోతాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జగన్‌కు ఓటు వేస్తే నరేంద్ర మోదీకి ఓటు వేసినట్టే అని.. జగన్ సీఎం అయితే రాష్ట్రంలో మైనారిటీలకు భద్రత లేకుండా పోతుందని ఆరోపించారు. 
 
ఎన్నికల్లో టీడీపీని ఏపీ ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించాలని ప్రతీ ఒక్కరికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే మీ బిడ్డల భవిష్యత్ బాగుంటుందని.. జగన్ అధికారంలోకి వస్తే అరాచకాలు పెరిగిపోతాయని చెప్పారు. తాము అధికారంలో ఉంటే భూముల రేట్లు పెరుగుతాయని.. జగన్ అధికారంలో ఉంటే అవినీతి పెరిగిపోతుందని పేర్కొన్నారు.  
 
సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం ముగింపు అనంతరం అమరావతి ప్రజావేదికలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర పరిస్థితులను ప్రస్తావించారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ ఇచ్చిన మాట తప్పిన వైనాన్ని అందరికీ గుర్తుచేశారు. అందుకోసం గత ఎన్నికల్లో మోదీ ఏపీలో బహిరంగ సభల్లో ఏమేమి హామీలు ఇచ్చారో ప్రత్యేకంగా క్లిప్పింగ్‌లు వేసి ప్రదర్శించారు.  
 
ఆ తర్వాత కేసీఆర్ గతంలో ఏమన్నాడో కూడా క్లిప్పింగ్స్ రూపంలో చూపించారు. ఆఖరికి కల్వకుంట్ల కవిత కూడా పోలవరం ప్రాజక్ట్‌కు వ్యతిరేకంగా తామేం చేశామో వివరంగా చెప్పడం మరో క్లిప్‌లో చూపించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై అప్పుడేమన్నారో ఇప్పుడేమన్నారో కూడా చంద్రబాబు స్వయంగా యాంకరింగ్ చేస్తూ ఒక్కో క్లిప్‌ను ప్రదర్శించారు. 
 
ఓ క్లిప్‌లో కవిత మాట్లాడుతూ, జగన్ వస్తాడు, పోలవరం కడతాడు, అంటున్నారని, అన్ని కేసులున్న నాయకుడ్ని తెలంగాణ జైళ్లలో కూడా ఉంచబోమని చెప్పారు. అలాంటి నాయకుడ్ని తమ జైళ్లలో పెడితే జైళ్ల భూముల్ని కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుందన్నారు. అందుచేత ఏపీలో టీడీపీనే అధికారంలోకి రావాలని చంద్రబాబు చెప్పకనే చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

తర్వాతి కథనం
Show comments