Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబా మజాకా.... కాంగ్రెస్ పెద్దలను కూడా కొనేసిన చంద్రబాబు : విజయసాయి

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (12:31 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పెద్దలను కూడా బాబు డబ్బుతో కొనిపడేశారంటూ ఆరోపించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితుడయ్యారు. 
 
దీనిపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ, చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్ అని అన్నారు. పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు.
 
ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కొనిపడేసి, తన శిష్యుడు రేవంత్‌కు అధ్యక్ష పీఠాన్ని ఇప్పించుకున్నాడని అన్నారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టు పట్టించాడని దుయ్యబట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్‌గా తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడని అన్నారు.  
 
కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు చంద్రబాబు బీజేపీ తీర్థం ఇప్పించారని విజయసాయి విమర్శించారు. ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించారని ఆరోపించారు. 
 
పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్‌లోకి తోలారని అన్నారు. 'బాబా మజాకా!' అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments