Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ కార్యకర్త అంత్యక్రియల్లో పాడెమోసిన చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (10:36 IST)
గుంటూరు జిల్లా మాచర్ల నియోజవర్గంలోని గుండ్లపాడులో వైకాపా గూండాల చేతిలో హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పాడెమోశారు. ఆ తర్వాత గ్రామంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "జగన్ రెడ్డీ.. నీ చెంచాలతో మాట్లాడించడం కాదు.. ధైర్యం ఉంటే రా.. బాబాయిని గొడ్డలితో చంపి గుండెపోటు అని చెప్పడం కాదు. మీరు చేసే పనులే మీ కార్యకర్తలు చేస్తున్నారు" అంటూ మండిపడ్డారు. 
 
"రాష్ట్రంలో తెలుగు పార్టీ 22 యేళ్లపాటు పరిపాలన చేసింది. కానీ, ఎన్నడూ కూడా మీలా హత్యా రాజకీయాలు ప్రోత్సహించలేదు. మీరు చేసిన హత్యలకు సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. 
 
"వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత 33 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని, వీటన్నింటికీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకోండి. మీ గుండెల్లో నిద్రపోతా. టీడీపీ కుటుంబం జోలికి వస్తే వదిలేది లేదు" అని చంద్రబాబు హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments