Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత బ్రాండ్లు తెచ్చి మందుబాబులను పీల్చిపిప్పి చేస్తున్నారు: చంద్రబాబు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (08:13 IST)
నాసిరకం మద్యంతో సొంత బ్రాండ్లు తెచ్చి మందుబాబులను ఆర్థికంగా, శారీరకంగా పీల్చిపిప్పి చేస్తున్నారని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్‌ అక్రమ రవాణా జరుగుతోందని, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి రూ.వేల కోట్లు దిగుమతి అవుతున్నాయని టిడిపి ఆరోపించారు. డ్రగ్స్‌ వ్యాపారానికి గేట్లు ఎత్తి సంఘ వ్యతిరేక శక్తులు, టెర్రరిస్టు సంస్థలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో టాల్కమ్‌ పౌడర్‌ కంపెనీ పేరుతో రూ.21 వేల కోట్ల హెరాయిన్‌ పట్టుబడిందన్నారు. దీనికి ముఖ్యమంత్రి, డిజిపి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్‌ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని విమర్శించారు.

ప్రభుత్వం నుంచి సాయం అందక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎరువులు, విత్తనాల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైసిపి పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని, ఉపాధి, పెట్టుబడులు లేవన్నారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి భావితరాల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments