Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగళ్ళు ఘటనలో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (11:58 IST)
అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. పైగా, పూర్తి వివరాలతో హాజరుకావాలని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 
 
కాగా, అన్నమయ్య జిల్లాలో తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీటి ప్రాజెక్టు పనులను వైకాపా ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో అంగళ్లు వద్ద టీడీపీ, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీ కార్యకర్తలు తమపై రాళ్లు విసిరారని చంద్రబాబు పిటిషన్‌ వేశారు. తన సెక్యూరిటీ సిబ్బంది కాపాడారని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అయితే, గొడవలకు చంద్రబాబే కారణమంటూ ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments