Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటమి కంటే.. ఓడిన తీరే బాధగా ఉంది : చంద్రబాబు

Webdunia
శనివారం, 25 మే 2019 (07:55 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కొందరు పార్టీ సీనియర్ నేతలు కలుసుకున్నారు. ముఖ్యంగా, ఈ ఎన్నికల్లో గెలుపొందిన కొందరు నేతలు ఆయనతో సమావేశమై ఎన్నికల ఫలితాలపై విశ్లేషించారు. ప్రధానంగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయం చెందడంపై వారంతా విస్మయం వ్యక్తం చేశారు. 
 
ఈ ఓటమిపై టీడీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. ముఖ్యంగా, ఐదేళ్ళపాటు మీరు ఎంత చాకిరీ చేశారో తలచుకుంటే బాధ కలుగుతుంది సార్ అని చంద్రబాబుతో పలువురు నేతలు అన్నారు. దానికి చంద్రబాబు సమాధానమిస్తూ. మనం పడిన కష్టం ప్రజలకు తెలుసు.. కానీ తప్పుడు ఎక్కడ జరిగిందో తెలుసుకుని అధ్యయనం చేయాల్సివుందన్నారు. 
 
అసలు ఈ ఎన్నికల ఫలితాలు ఇప్పటికీ నమ్మలేక పోతున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నాం.. ఒకవేళ ఓడినా మెజారిటీ మార్కుకు 10 లేదా 15 సీట్లు తక్కువగా వస్తాయని అంచనా వేశాం. కానీ ఇంత ఘోరమైన పరాభవమా? అంటూ ఆయన నేతల వాపోయినట్టు సమాచారం. ఈ ఓటమి కంటే.. ఓడిన తీరు చాలా బాధగా ఉందన్నారు. 
 
మనకు కేవలం పాతిక సీట్లే వచ్చాయా? విపక్షానికి 151 సీట్లా? నమ్మశక్యంగా లేదన్నారు. అంటే మనం నిజంగా అంత ఘోర తప్పిదాలు చేశామా? ప్రజలను కష్టపెట్టామా? అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments