Webdunia - Bharat's app for daily news and videos

Install App

కందుకూరు - గుంటూరు తొక్కిసలాటలు వైకాపా కుట్ర : చంద్రబాబు ఆరోపణ

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (16:10 IST)
కందుకూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలు యాదృచ్ఛికంగా జరిగినవి కావని, వైకాపా కుట్ర అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ నగరంలో చంద్రబాబును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. వీరిద్దరు దాదాపు 2 గంటల పాటు సుధీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 
 
వైకాపా ప్రభుత్వం చీకట్లో తీసుకొచ్చిన జీవో నంబర్ 1 ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో జరగరానిది జరుగుతోంది. విశాఖలో ఆంక్షలు పెట్టి పవన్‌‍ను హింసించారు. ఇప్పటంలో పవన్ సభకు స్థలం ఇస్తే ప్రజల ఇళ్లను కూల్చివేశారు. విశాఖలో నన్ను కూడా అడ్డుకున్నారు. జీవో నంబర్ 1 పరిణామాలను ముందుగానే విశాఖలో చూశాం. వైకాపా ప్రబుత్వం అరాచకాలు పరాకాష్టకు చేరాయి. 
 
కుప్పం వెళ్తానంటే అడ్డుంకులు సృష్టించారు. వైకాపా కుట్రలో భాగమే కందుకూరు, గుంటూరు ఘటనలు అని ఆరోపించారు. కందుకూరు ఘటన పోలీసుల కుట్ర కాదని చెప్పే ఈ పోలీసులకు ఉందా? కుట్ర కుతంత్రాలకు సాగే రాజకీయాలను తిప్పికొడతాం. ఏపీ అభివృద్ధిని తిరిగి గాడిలో పెడతాం. ఏపీలో వ్యవస్థలను నాశనం చేశారు. చేస్తున్నారు కూడా. రాష్ట్రంలో ప్రజాజీవితం అంధకారమైంది. ఇప్పటికే ప్రజాస్వామ్యయ పరిరక్షణకు వేదిక ఏర్పాటైంది. ఇక అన్ని రకాల పోరాటాలు చేస్తాం అని చంద్రబాబు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments