Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచిత ఇసుక విధానం.. తేడా జరిగితే అంతే సంగతులు.. బాబు స్ట్రాంగ్ వార్నింగ్

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (23:15 IST)
Chandra babu
సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉచిత ఇసుక విధానంపై వస్తున్న ఫిర్యాదులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇసుక పాలసీ లక్ష్యాలను ఉల్లంఘించకూడదని ఉద్ఘాటించారు. 
 
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నా.. ఇప్పటికీ ఇసుక కోసం పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై ఆయన కేబినెట్ మంత్రులపై సీరియస్ అయ్యారు. పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రజలు తమ ఇళ్లను నిర్మించుకునేందుకు ఉచితంగా ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, కొందరు దళారులు ఇసుకకు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
 
ఉచిత ఇసుక విధానంలో మరోసారి ఇలాంటి తేడాలు కనిపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. 10 రోజుల్లో అన్నీ సర్దుకోవాలని చెప్పారు. మరోసారి తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఉచిత ఇసుక విధానం అమలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పూర్తి బాధ్యత వహించాలని ఇన్‌చార్జి మంత్రులను ఆదేశించారు. అనవసరమైన షరతులన్నీ తొలగించాలని, ఇసుక రవాణా, తవ్వకాలకు కనీస చార్జీలు మాత్రమే వర్తింపజేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments