Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచిత ఇసుక విధానం.. తేడా జరిగితే అంతే సంగతులు.. బాబు స్ట్రాంగ్ వార్నింగ్

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (23:15 IST)
Chandra babu
సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉచిత ఇసుక విధానంపై వస్తున్న ఫిర్యాదులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇసుక పాలసీ లక్ష్యాలను ఉల్లంఘించకూడదని ఉద్ఘాటించారు. 
 
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నా.. ఇప్పటికీ ఇసుక కోసం పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై ఆయన కేబినెట్ మంత్రులపై సీరియస్ అయ్యారు. పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రజలు తమ ఇళ్లను నిర్మించుకునేందుకు ఉచితంగా ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, కొందరు దళారులు ఇసుకకు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
 
ఉచిత ఇసుక విధానంలో మరోసారి ఇలాంటి తేడాలు కనిపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. 10 రోజుల్లో అన్నీ సర్దుకోవాలని చెప్పారు. మరోసారి తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఉచిత ఇసుక విధానం అమలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పూర్తి బాధ్యత వహించాలని ఇన్‌చార్జి మంత్రులను ఆదేశించారు. అనవసరమైన షరతులన్నీ తొలగించాలని, ఇసుక రవాణా, తవ్వకాలకు కనీస చార్జీలు మాత్రమే వర్తింపజేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్-9 సీజన్ : ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో... తెలుసా?

80s Reunion heros and heroiens: స్నేహం, ఐక్యత కు ఆత్మీయ వేదిక 80s స్టార్స్ రీయూనియన్‌

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments