30 ఏళ్ల వయస్సులోనే ఆమెపై 12 కేసులు.. రూ.58.75 లక్షలు మోసం

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (23:01 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో 12 కేసుల్లో ఉద్యోగ అవకాశాల పేరిట మోసం చేసిన 30 ఏళ్ల మహిళను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాగ్నిజెంట్, ఐబీఎం వంటి బహుళ-జాతీయ సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది వ్యక్తులను మోసం చేసింది.
 
రేష్మా అనే నిందితురాలు, తన మాజీ భర్త మహమ్మద్ అలీ, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి నకిలీ సిమ్ కార్డులను కొనుగోలు చేసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో ఉద్యోగం కోసం సంప్రదించే వ్యక్తులను మోసం చేశారు.  
 
ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివసిస్తున్న 34 ఏళ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్ వనజను కాగ్నిజెంట్‌లో సీనియర్ హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్) మేనేజర్‌గా నటిస్తూ రేష్మా మోసం చేసింది. ఆ సమయంలో తన ముగ్గురు స్నేహితులు ఉద్యోగాల కోసం వెతుకుతున్నారని వనజ పేర్కొన్న తర్వాత, రేష్మ ఆమెను సుప్రీతి అనే మరో కాగ్నిజెంట్ ఉద్యోగి వద్దకు రెఫర్ చేసింది. 
 
అయితే మొత్తం డ్రామా సక్సెస్ అయ్యాక వనజలా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి వద్ద  మొత్తం రూ.58.75 లక్షలు మోసం చేసింది. ఇలా లక్షల రూపాయలను మోసం చేసిన ఈ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి., భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 66D కింద, సెక్షన్ 420, 467 (ఫోర్జరీ), 468 (మోసం కోసం ఫోర్జరీ) కేసుల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments