ఎపి డిజిపికి వరుస సవాళ్లు...

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (20:48 IST)
ఎపి డిజిపి ఆర్.పి.ఠాగూర్ సవాళ్ళతో సావాసం చేస్తున్నారు. ఆయన ఆ సీట్లో వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు డిజిపికి కొత్త సవాళ్ళను విసురుతున్నాయి. వరుస ఘటనలతో పోలీస్ బాస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 
అనేక వడపోతల తరువాత నాలుగు నెలల క్రితం ఎపి డిపిజిగా ఆర్.పి.ఠాగూర్ ను ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి డిజిపికి కంటి మీద కునుకులేదు. బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి ప్రభుత్వంతో పాటు డిజిపికి తలనొప్పిగా మారింది. జరుగుతున్న వరుస ఘటనలకు వెంటనే స్పందిస్తున్నా ఏదో ఒక రూపంలో సమస్య వచ్చి పడుతూనే ఉంది. 
 
అనంతలో ప్రబోధానంద ఆశ్రమం.. పోలీసులు, ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలాగే విశాఖలో టిడిపి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలు, ఆ తరువాత జరిగిన పరిణామాలు ఇదంతా డిజిపిని ఇబ్బందుల్లోకి నెట్టాయి.
 
ఇదిలా ఉండగానే ఎపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై దాడి. గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్లు డిజిపి పరిస్థితి మారింది. ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. జగన్ పైన దాడి జరిగిన తరువాత డిజిపి మాట్లాడిన తీరును వైసిపి నేతలు తప్పుబట్టారు. జగన్ పైన దాడి చేసిన తరువాత పోలీసులు వేగంగా స్పందించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా నాలుగు నెలల కాలంలో డిజిపి అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments