Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలసాని శ్రీనివాస్‌ కుమార్తె శిరిష్మ ఆత్మహత్య..

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:44 IST)
ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంతానం లేకపోవడంతో కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మనస్తాపంతో సతమతమవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆత్మహత్యకు అదే కారణమని భావిస్తున్నారు.
 
ప్రస్తుతం శిరిష్మ హైదరాబాద్‌లో ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఓయూ కాలనీలోని ట్రయల్‌ విల్లాస్‌లో నివసించే గ్రానైట్‌ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016 డిసెంబర్‌లో ఆమె వివాహం జరిగింది. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్‌ సమీపంలోని ప్లాట్‌ 906-డిలో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. 
 
వివాహమై నాలుగేళ్లు గడిచినా సంతానం లేకపోవడంతో శిరిష్మ కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో బుధవారం రాత్రి తన ఇంట్లోని ఓ గదిలో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
శిరిష్మ భర్త సిద్దార్థ్ బుధవారం రాత్రి ఇంటికి చేరుకునేసరికి ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు అతను సమాచారమిచ్చాడు. ఆపై ఆస్పత్రికి తరలించగా... అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments