Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 ఇయర్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు క్లీన్ బౌల్డ్ అయ్యారు : మంత్రి పెద్దిరెడ్డి

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:34 IST)
రాజకీయాల్లో 40 యేళ్ల ఇండస్ట్రీ అంటూ గొప్పలు చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లీన్ బౌల్డ్ అయ్యారంటూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా,  పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారులు 80శాతానికి పైగా సర్పంచ్‌ స్థానాలను కైవసం చేసుకున్నారు. 
 
ఈ అంశాన్ని ప్రస్తావించిన మంత్రి పెద్దిరెడ్డి... 'కుప్పం ఓటమితో 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు క్లీన్‌ బౌల్డయ్యాడు. ఈ ఫలితాలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాడా లేక కుట్రలే పన్నుతూ రాజకీయాల్లోనే కొనసాగుతాడా? అనేది తేల్చుకోవాలి' అని చెప్పారు. 
 
కుప్పం మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటామని చెప్పారు. ఎస్‌ఈసీ గురించి తానేమీ మాట్లాడబోనని, చంద్రబాబు కొన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకుని తమను టార్గెట్‌ చేశారన్నారు. ఇకనైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ త్వరలో చంద్రబాబుకు పిచ్చి పట్టడం ఖాయమని, అందుకే ఆయన నిమ్మగడ్డపై మండిపడుతున్నారని చెప్పారు. నిమ్మగడ్డలో మార్పు కనిపిస్తోందని, చంద్రబాబు కుట్రలకు మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments