Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్ లెక్కింపు ఏర్పాట్లపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి సమీక్ష

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (16:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో 4వ తేదీన చేపట్టనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు. 
 
ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్, ఎన్‌కోర్‌లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటుపై సీఈవో పలు సూచనలు చేశారు. 
 
ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టేట్యూటరీ నివేదిక, రౌండ్ వైజ్‌ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీ లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానంపై సూచనలు చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు, తదితర అంశాలపై జిల్లాల వారీగా ఎన్నికల అధికారులతో సీఈవో సమీక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments