Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్, చైనాల‌ కవ్వింపు చర్యల‌ను తిప్పికొట్టాలి

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (09:46 IST)
భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోంద‌ని కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి చెప్పారు. పాకిస్థాన్, చైనాల‌ చర్యలను తిప్పికొట్టాల‌న్నారు.

తిరుపతిలో కపిలతీర్థం సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులను స్మరించుకుంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సతీమణులను కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి సన్మానించారు. మోడీ హయాంలో దేశంలో ఎక్కడా అల్లర్లు, ఉగ్రవాదుల దుశ్చర్యలు జరుగలేద‌ని, దేశ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలోనే ఉన్నార‌ని చెప్పారు. దేశం కోసం త్యాగం చేసిన వారిని ఎప్పటికీ గుర్తించుకోవాల‌ని, దేశ రక్షణ కోసం తిరుపతి లాంటి ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయార‌ని, అలాంటి సైనికుల కుటుంబాలకు అండగా ఉండాల‌ని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.

వీర సతీమణుల ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధానమంత్రి సూచించారని, సైనికుల వల్లే దేశంలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామ‌న్నారు. దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉంద‌ని కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments