Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కేంద్రం షాక్..! రాజధానిని ఎత్తేశారా..?

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (05:56 IST)
ఏపీకి రాజధాని లేదా.. నిజమా అంటే.. అవుననే అంటోంది కేంద్ర ప్రభుత్వం. కావాలని చేశారో.. తెలీక చేశారో కానీ.. ఏపీకి రాజధాని లేకుండా చేశారు. దీంతో.. ఏపీకి చెందిన నేతలు, ప్రజలు అవాక్కవుతున్నారు. ఇంతకీ కేంద్రం చేసిన ఆ పని ఏంటి..!
 
గత కొన్ని రోజులుగా.. ఏపీ రాజధానిపై.. ఆంధ్రప్రదేశ్‌లో రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. రాజధాని మా ప్రాంతంలో కావాలంటే.. మాకు కావాలని.. పలు జిల్లాలకు చెందిన వారు నిరసనలకు, గొడవలకు దిగుతోన్నారు.

అందులోనూ.. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఏపీ రాజధాని.. అమరావతినే అని ఫిక్స్‌ అయి.. అక్కడ.. రైతుల నుంచి భూములను కూడా తీసుకుని.. పెద్ద ఎత్తున నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. అనంతరం.. 2019 ఎన్నికల్లో.. వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ వచ్చాక.. రాజధానిపై పెద్ద దుమారమే లేచింది.

కాసేపు ప్రకాశం జిల్లాలోని దొనకొండ అని.. మరోవైపు కర్నూలు అని పలు ప్రాంతాలు చర్చలకు వచ్చాయి. అయితే.. రాష్ట్రంలో ఇంత జరుగుతోన్నా.. ఏపీ రాజధాని అంశంపై కానీ.. దాని గురించి ప్రస్తావన కానీ.. చేయలేదు సీఎం జగన్.
 
అయితే.. కేంద్రం ప్రభుత్వం కూడా.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు అనుకుందో ఏమో.. కానీ.. తాజాగా.. విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్‌లో.. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేదు. జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మోడీ సర్కార్ భారత దేశ పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది.

ఇందులో 28 రాష్ట్రాలతో పాటు 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే.. కేంద్రం విడుదల చేసిన ఈ మ్యాప్‌లో.. అన్ని రాష్ట్రాలకూ.. రాజధానులను తెలిపింది.. కానీ ఒక్క ఏపీకి తప్ప. ఏపీ రాజధాని.. మ్యాప్‌లో లేకపోవడం.. ఇటు నేతలకు అటు ప్రజలకు ఆశ్చర్యం కల్గిస్తోంది.

అమరావతి అని పేర్కొన్నా పెద్ద రచ్చ లేకపోయేది కానీ.. ఇప్పుడు మొత్తానికి ఏపీకి రాజధానిని ఎత్తేయడంతో.. ఇప్పుడు ఫుల్లుగా.. రచ్చ షురూ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments