Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు విచారణ : సీబీఐ అధికారులకు వార్నింగ్

Webdunia
బుధవారం, 11 మే 2022 (09:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బెదిరించారు. ఈ కేసు విచారణను తక్షణం నిలిపివేసి కడపను వీడి వెళ్లిపోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులపై సీబీఐ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా, సీబీఐ అధికారులకు కారు డ్రైవర్‌గా పని చేస్తున్న వలీబాషాను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. దీనిపై ఆయన కడప చిన్నచౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ బెదిరింపులపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ నెల 8వ తేదీన సీబీఐ అధికారులకు భోజనం తెచ్చేందుకు వలీబాషా కారులో కడపలోని హరిత హోటల్‌ నుంచి బైపాస్ రోడ్డులోని డాబాకు వెళ్లారు. భోజనం పట్టుకుని తిరిగి వస్తుండగా, ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కారుకు బైకును అడ్డుగా పెట్టి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. 
 
సీబీఐ అధికారులతో పాటు నువ్వు కూడా దర్యాప్తును ఆపేసి కడపను వదిలి తక్షణం వెళ్లిపోవాలి. లేదంటే మీ అంతు చూస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. దండుగులు తనను బెదిరించిన విషయమై ఈ నెల 9వ తేదీన వలీబాషా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments