Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు విచారణ : సీబీఐ అధికారులకు వార్నింగ్

Webdunia
బుధవారం, 11 మే 2022 (09:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బెదిరించారు. ఈ కేసు విచారణను తక్షణం నిలిపివేసి కడపను వీడి వెళ్లిపోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులపై సీబీఐ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా, సీబీఐ అధికారులకు కారు డ్రైవర్‌గా పని చేస్తున్న వలీబాషాను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. దీనిపై ఆయన కడప చిన్నచౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ బెదిరింపులపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ నెల 8వ తేదీన సీబీఐ అధికారులకు భోజనం తెచ్చేందుకు వలీబాషా కారులో కడపలోని హరిత హోటల్‌ నుంచి బైపాస్ రోడ్డులోని డాబాకు వెళ్లారు. భోజనం పట్టుకుని తిరిగి వస్తుండగా, ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కారుకు బైకును అడ్డుగా పెట్టి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. 
 
సీబీఐ అధికారులతో పాటు నువ్వు కూడా దర్యాప్తును ఆపేసి కడపను వదిలి తక్షణం వెళ్లిపోవాలి. లేదంటే మీ అంతు చూస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. దండుగులు తనను బెదిరించిన విషయమై ఈ నెల 9వ తేదీన వలీబాషా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments