Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులివెందులలో సీబీఐ బృందం.. వివేకా - అవినాష్ ఇళ్ళలో తనిఖీలు

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (18:57 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరోమారు పులివెందులలో కనిపించారు. ఆదివారం కొందరు అధికారులు పులివెందులకు చేరుకుని వివేకా నంద రెడ్డి హత్యకు గురైన ఇంటితో పాటు ఆ పక్కనే ఉన్న కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి పీఏ రమణారెడ్డితో సీబీఐ అధికారులు మాట్లాడారు. 
 
అలాగే, వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే ఇనయతుల్లాతో కూడా సిట్ అధికారులు మాట్లాడారు. వివేకా హత్య జరిగిన ఇంటితో పాటు బాత్రూమ్, బెడ్రూమ్‌లను కూడా పరిశీలించారు. అటు తర్వాత వివేకా ఇంటి నుంచి బయటకు వచ్చిన అధికారులు సమీపంలోని అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆ పరిసరాలను తనిఖీ చేశారు. అవినాష్ ఇంటిని పరిశీలించాక తిరిగి వివేకా ఇంటికి వచ్చిన హత్య జరిగిన ప్రాంతాన్ని చూశారు. 
 
హత్య జరిగిన రోజున, సమయంలో ఎవరెవరు ఉన్నారో ఆరా తీశారు. అవినాష్ రెడ్డి ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో రావొచ్చునే సాంకేతికంగా ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా, తమ విచారణలో అవినాష్ రెడ్డి చెప్పిన విషయాలను నిజమో కాదో.. ఆయన పీఏ రమణారెడ్డి వద్ద కూడా ఆరా తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments