Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులివెందులలో సీబీఐ బృందం.. వివేకా - అవినాష్ ఇళ్ళలో తనిఖీలు

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (18:57 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరోమారు పులివెందులలో కనిపించారు. ఆదివారం కొందరు అధికారులు పులివెందులకు చేరుకుని వివేకా నంద రెడ్డి హత్యకు గురైన ఇంటితో పాటు ఆ పక్కనే ఉన్న కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి పీఏ రమణారెడ్డితో సీబీఐ అధికారులు మాట్లాడారు. 
 
అలాగే, వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే ఇనయతుల్లాతో కూడా సిట్ అధికారులు మాట్లాడారు. వివేకా హత్య జరిగిన ఇంటితో పాటు బాత్రూమ్, బెడ్రూమ్‌లను కూడా పరిశీలించారు. అటు తర్వాత వివేకా ఇంటి నుంచి బయటకు వచ్చిన అధికారులు సమీపంలోని అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆ పరిసరాలను తనిఖీ చేశారు. అవినాష్ ఇంటిని పరిశీలించాక తిరిగి వివేకా ఇంటికి వచ్చిన హత్య జరిగిన ప్రాంతాన్ని చూశారు. 
 
హత్య జరిగిన రోజున, సమయంలో ఎవరెవరు ఉన్నారో ఆరా తీశారు. అవినాష్ రెడ్డి ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో రావొచ్చునే సాంకేతికంగా ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా, తమ విచారణలో అవినాష్ రెడ్డి చెప్పిన విషయాలను నిజమో కాదో.. ఆయన పీఏ రమణారెడ్డి వద్ద కూడా ఆరా తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments