పులివెందులలో సీబీఐ బృందం.. వివేకా - అవినాష్ ఇళ్ళలో తనిఖీలు

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (18:57 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరోమారు పులివెందులలో కనిపించారు. ఆదివారం కొందరు అధికారులు పులివెందులకు చేరుకుని వివేకా నంద రెడ్డి హత్యకు గురైన ఇంటితో పాటు ఆ పక్కనే ఉన్న కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి పీఏ రమణారెడ్డితో సీబీఐ అధికారులు మాట్లాడారు. 
 
అలాగే, వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే ఇనయతుల్లాతో కూడా సిట్ అధికారులు మాట్లాడారు. వివేకా హత్య జరిగిన ఇంటితో పాటు బాత్రూమ్, బెడ్రూమ్‌లను కూడా పరిశీలించారు. అటు తర్వాత వివేకా ఇంటి నుంచి బయటకు వచ్చిన అధికారులు సమీపంలోని అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆ పరిసరాలను తనిఖీ చేశారు. అవినాష్ ఇంటిని పరిశీలించాక తిరిగి వివేకా ఇంటికి వచ్చిన హత్య జరిగిన ప్రాంతాన్ని చూశారు. 
 
హత్య జరిగిన రోజున, సమయంలో ఎవరెవరు ఉన్నారో ఆరా తీశారు. అవినాష్ రెడ్డి ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో రావొచ్చునే సాంకేతికంగా ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా, తమ విచారణలో అవినాష్ రెడ్డి చెప్పిన విషయాలను నిజమో కాదో.. ఆయన పీఏ రమణారెడ్డి వద్ద కూడా ఆరా తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments