''బిగ్ బాస్'' షోపై జేడీ.. సెలెబ్రిటీలతో కాదు.. రైతులతో నిర్వహించాలి..

''బిగ్ బాస్'' షోపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. గతంలో బిగ్ బాస్ షోను చూడటం సమయం వృధా అంటూ యువతకు సూచించిన జేడీ.. ప్రస్తుతం బిగ్ బాస్ షోను రైతులతో నిర్వహించాలని కామెంట్ చేశారు. సెలెబ్రిటీలతో కా

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (15:18 IST)
''బిగ్ బాస్'' షోపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. గతంలో బిగ్ బాస్ షోను చూడటం సమయం వృధా అంటూ యువతకు సూచించిన జేడీ.. ప్రస్తుతం బిగ్ బాస్ షోను రైతులతో నిర్వహించాలని కామెంట్ చేశారు. సెలెబ్రిటీలతో కాకుండా రైతులతో ఈ షో నిర్వహించాలన్నారు. 
 
తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా లక్ష్మీ నారాయణ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడలో నిర్వహించిన ''ప్రజాస్వామ్మ పరిరక్షణ సదస్సు''లో మాట్లాడుతూ.. సామాజిక వర్గం కంటే, సమాజమే ముఖ్యమని.. ప్రజాస్వామ్యం వైపు పూర్తిగా ప్రజలు తమ ఆలోచనలు మళ్లించాలని.. రాజకీయ వ్యవస్థలో మంచి మార్పు తీసుకురావాలని సూచించారు. 
 
తూర్పుగోదావరి జిల్లాలోని సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని.. ఇప్పటికే ఆయన అపాయింట్‌మెంట్ కోరానని జేడీ తెలిపారు. చంద్రబాబుతో అపాయింట్ మెంట్ తేదీ ఫిక్స్ కాగానే తాను గుర్తించిన సమస్యలను ఆయనకు చేరవేస్తానని తెలిపారు. 
 
ఈ ప్రాంతంలో కొబ్బరి రైతుల సమస్యలు, మత్స్యకారుల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను గుర్తించామని, ఓఎన్జీసీ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఓ నివేదిక తయారు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments