Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ బెయిల్ రద్దేనా?

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (13:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఆయన బెయిలు రద్దుకు సంబంధించి సీబీఐ కోర్టు బుధవారం మరికొన్ని గంటల్లో తీర్పును వెలువరించనుంది. దీంతో తీర్పు ఏవిధంగా ఉంటుందోనన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ నెలకొనివుంది. 
 
సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిలు రద్దు చేసి వారిపై నమోదైన కేసులను త్వరితగతిన విచారించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏప్రిల్‌లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాలను జగన్ దుర్వినియోగం చేస్తూ బెయిలు షరతులను ఉల్లంఘిస్తున్నారని అందులో ఆరోపించారు. 
 
ముఖ్యంగా, వివిధ కారణాలు చూపుతూ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని రఘురామ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జులైలోనే వాదనలు పూర్తి కాగా తీర్పును సీబీఐ కోర్టు బుధవారానికి రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనన్న అటు వైసీపీ నేతల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments