Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరమీను అంటూ క్యాట్ ఫిష్‌లు అమ్మేస్తున్నారు.. క్యాన్సర్‌తో జాగ్రత్త

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (22:47 IST)
cat fish
కొరమీను అంటూ క్యాట్ ఫిష్‌లను అమ్మేస్తున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ పెంపకం బయటకు వచ్చింది. పొలాల మధ్యలో చిన్న చిన్న చెరువులలో వీటి పెంపకాన్ని చేపట్టి కొందరు కాసులు వెనకేసుకుంటున్నారు.
 
చేపలలో బాగా డిమాండ్ ఉండే కోరమీనును పోలి ఉండే ఈ చేపను మీసాలు పీకేసి కోరమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో రూ.400లు ఉంటే కోరమీను పేరుతో కిలో రూ.150 ఉండే క్యాట్ ఫిష్‌ను యథేచ్ఛగా అమ్మేస్తున్నారు.
 
కుళ్ళిన మాంసమే ప్రధాన ఆహరంగా పెరిగే ఈ క్యాట్ ఫిష్ కేవలం ఆరునెలల్లోనే ఇరవై కేజీల బరువు వరకు పెరుగుతుందటే అర్థం చేసుకోవచ్చు. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుంది. అందుకే సుప్రీం కోర్టు దీనిని నిషేధించింది. కానీ.. అక్రమంగా పెంచి కోరమీను పేరుతో అమ్మేస్తున్నారు.
 
ఈ చేపలను తింటే పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాట్ ఫిష్‌లో ఉండే ఒమేగా ఫ్యాట్-6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments