వైకాపా నేత భూమన ఫేక్ ప్రచారం... పోలీస్ కేసు నమోదు

ఠాగూర్
మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (22:40 IST)
వైకాపా నేత, తితిదే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఫేక్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆయనపై తిరుపతి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. తితిదేపై అసత్య ప్రచారం చేసినందుకు ఆయనపై ఈ కేసు నమోదైంది. తిరుపతి, అలిపిరి సమీపంలోని ఓ విగ్రహంపై భూమన అసత్యాలు చెప్పారు. 
 
మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగిందంటూ, ఇది సనాతన ధర్మానికి విఘాతం కలిగేలా తితిదే అధికారులు నడుచుకుంటున్నారని ఆయన అసత్య ప్రచారం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి తన వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని డిప్యూటీ ఈవో గోవిందరాజు ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అంతకుముందు ఆయన అలిపిరిలో శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారని, మలమూత్రాలు, మద్యం బాటిల్స్ ఆ చుట్టుపక్కల పడి ఉన్నాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. విగ్రహం పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తితిదే చైర్మన్, పాలకమండలికి చెందిన సభ్యులంతా తమతమ పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసారు. అలాగే, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హిందూత్వ సంఘాలు, మఠాధిపుతులు మేల్కొవాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments