Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో దువ్వాడ-దివ్వెల రీల్స్.. కేసు నమోదు చేసిన పోలీసులు

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (23:34 IST)
తిరుమలకు వచ్చిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఫొటో‌షూట్ చేయించుకున్నారని తెలిసింది. ఇలాంటివి కొండపై నిషేధం. స్వామి వారి సన్నిధిలో.. భక్తి మాత్రమే ఉండాలి. ఎక్స్‌ట్రాలు ఏవీ ఉండకూడదు. కానీ వీరిద్దరూ కలిసి.. హాయిగా పోజులిస్తూ ఫొటోషూట్ చేయించుకున్నారనే వివాదం తెరపైకి వచ్చింది. 
 
దివ్వెల మాధురి తిరుమాఢ వీధుల్లో, పుష్కరిణి దగ్గర ఫొటోలు తీయించుకోవడం చర్చకు దారితీసింది. ఇలాంటివి కొండపై చెయ్యకూడదు అని చెప్పాల్సిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. అది మానేసి, తనే దగ్గరుండి మాధురిని ఫొటోలు తీయించారని టాక్ వినిపిస్తోంది. 
 
ఈ వివాదంపై తిరుమల పోలీసులు స్పందించారు. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది.

పవిత్రమైన తిరుమాడ వీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేశారని ఆరోపణలున్నాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బీఎన్ఎస్ 292,296, 300 సెక్షన్ 66 -200-2008 కింద కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments