పవన్ డాటర్స్.. ట్రోల్స్ తాటతీయనున్న ఏపీ సర్కారు

సెల్వి
శనివారం, 2 నవంబరు 2024 (16:51 IST)
సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తులను దుర్భాషలాడుతూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోనుంది. తాజాగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఆయన కుటుంబసభ్యులపై అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పవన్ కళ్యాణ్ కుమార్తెల చిత్రాలను షేర్ చేస్తూ నిందితులు కించపరిచే విధంగా పోస్ట్ చేశారంటూ జనసేన ప్రాంతీయ సమన్వయకర్త మల్లెపు జయలక్ష్మి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 
 
ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66, 66సీ, 67తో పాటు బీఎన్‌ఎస్‌ 79, క్లాజ్‌ 353 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించామని, ప్రస్తుతం నిందితుల వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. 
 
ఇటీవల పవన్ కళ్యాణ్ తన కుమార్తెలు ఆరాధ్య, పోలేనా అంజనా పవనోవాతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. దీంతో పవన్ తొలిసారిగా ఇద్దరు కూతుళ్లతో కలిసి కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments