Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం: భక్తురాలు మృతి

ఐవీఆర్
శనివారం, 30 మార్చి 2024 (23:23 IST)
తిరుమల ఘాట్ రోడ్డులో శనివారం నాడు జరిగిన కారు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన 43 ఏళ్ల భక్తురాలు భవాని మృతి చెందారు. భవాని తన కుటుంబంతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. టీటీడీ విజిలెన్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఘాట్‌ రోడ్డులో ఎలిఫెంట్‌ గేట్‌ సమీపంలోకి వారి వాహనం రాగానే అక్కడ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో భవానీ అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు.
 
తన భర్త మురళీధర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. పిల్లలు నిసెర్గ(8), రక్షిత(6)కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తిరుమల టిటిడి అశ్విని ఆసుపత్రిలో చేర్పించారు. టీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులైన ముగ్గురి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈఓ సూచన మేరకు గాయపడిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments