Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం: భక్తురాలు మృతి

ఐవీఆర్
శనివారం, 30 మార్చి 2024 (23:23 IST)
తిరుమల ఘాట్ రోడ్డులో శనివారం నాడు జరిగిన కారు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన 43 ఏళ్ల భక్తురాలు భవాని మృతి చెందారు. భవాని తన కుటుంబంతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. టీటీడీ విజిలెన్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఘాట్‌ రోడ్డులో ఎలిఫెంట్‌ గేట్‌ సమీపంలోకి వారి వాహనం రాగానే అక్కడ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో భవానీ అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు.
 
తన భర్త మురళీధర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. పిల్లలు నిసెర్గ(8), రక్షిత(6)కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తిరుమల టిటిడి అశ్విని ఆసుపత్రిలో చేర్పించారు. టీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులైన ముగ్గురి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈఓ సూచన మేరకు గాయపడిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments