Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లియర్‌ట్రిప్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోని

ఐవీఆర్
శనివారం, 30 మార్చి 2024 (23:07 IST)
ఫ్లిప్‌కార్ట్ కంపెనీ అయిన క్లియర్‌ట్రిప్ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనిని ఎంచుకుంది. ఈ భాగస్వామ్యం క్లియర్‌ట్రిప్‌కి ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది, ఎందుకంటే ఇది మహేంద్ర సింగ్ ధోనితో జతకట్టడం ఒకటి అయితే, ప్రయాణంలో సరైన ఎంపికలు చేసుకోవాలని మహేంద్ర సింగ్ ధోని సూచించడం మరోటి. "క్లియర్‌చాయిస్" ప్రచారం కింద, నిర్ణయం తీసుకోవడాన్ని సులభతరం చేయడానికి, సౌకర్యవంతమైన, ఆందోళన-రహిత ప్రయాణ అనుభవాలను అందించడానికి ప్రయాణికులను ప్రేరేపించడం బ్రాండ్ లక్ష్యం.
 
క్లియర్‌ట్రిప్ బ్రాండ్ అంబాసిడర్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ, “నా కెరీర్ మొత్తంలో, ఖండాలు దాటి ప్రయాణించాను. నేను నిజమైన గ్లోబ్‌ట్రాటర్‌గా ఉన్నాను. ప్రయాణం పట్ల నాకున్న ప్రేమను కనుగొన్నాను. చాలా సంవత్సరాల తర్వాత, నేను ఆసక్తిగా ఎదురుచూసే విషయంగా ప్రయాణం మారింది. ఆహ్లాదకరమైన, చిరస్మరణీయమైన, అర్థవంతమైన ప్రయాణం ఎలా ఉండాలో ప్రతిబింబించే బ్రాండ్ అయిన క్లియర్‌ట్రిప్‌ బోర్డు లోకి వచ్చినందుకు నేను మరింత సంతోషంగా వున్నాను. నా కెరీర్‌లో, నేను ప్రతిరోజూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాను, కానీ క్లియర్‌ట్రిప్‌తో, నిర్ణయం తీసుకోవడం సులభం, సూటిగా ఉంటుంది. పారదర్శకత పట్ల వారి నిబద్ధత ఎంపికలను సులభతరం చేస్తుంది. ఎవరైనా తమ కలల ప్రయాణంలో నమ్మకంగా వెళ్లేలా చేస్తుంది" అని అన్నారు. 
 
ఈ భాగస్వామ్యంపై క్లియర్‌ట్రిప్ సిఇఒ, అయ్యప్పన్ ఆర్ మాట్లాడుతూ, “మహేంద్ర సింగ్ ధోనిని క్లియర్‌ట్రిప్ కుటుంబానికి స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అతను గౌరవనీయమైన క్రీడాకారుడు మాత్రమే కాదు ఆయన మొత్తం తరానికి స్ఫూర్తినిచ్చారు. విలువలకు ప్రసిద్ది చెందిన ధోనీ, తరచుగా నమ్మకం , గొప్ప నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంతో సంబంధం కలిగి వున్నారు. అతనితో మా భాగస్వామ్యం ద్వారా, ప్రయాణంలో సజావుగా సరైన ఎంపికలు చేసుకునేందుకు వ్యక్తులను శక్తివంతం చేయాలని మేము ఆశిస్తున్నాము. మేము వేగంగా  ఎదుగుతూనే ఉన్నందున, వారు ఎక్కడి నుండి వచ్చినా, ప్రతి ఒక్కరికీ ప్రయాణాన్ని సాధించగల ఆకాంక్షగా మార్చాలని మేము ఆశిస్తున్నాము. మహేంద్ర సింగ్ ధోనీ మాతో ఉండటంతో, పెద్ద సంఖ్యలో ప్రజలను, ఆత్మవిశ్వాసంతో బయటికి వెళ్లి ప్రపంచాన్ని అన్వేషించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా చేసుకున్నాము" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments