Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం, వేగం ఎక్కువై...

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (23:04 IST)
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అతి వేగంగా ఘాట్ రోడ్డులో పక్కనున్న గ్రిల్స్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో భక్తులకు గాయాలయ్యాయి. మొదటి ఘాట్ రోడ్డులోని వినాయకుడి గుడి దగ్గర ప్రమాదం జరిగింది.

 
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. దర్సనం తరువాత కారులో మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులు తిరుపతికి బయలుదేరారు. సరిగ్గా వినాయకుడి గుడి దగ్గరకు రాగానే కారు అదుపు తప్పింది.

 
అతి వేగంగా వస్తుండటంతో పక్కనే ఉన్న గ్రిల్స్ ను కారు ఢీకొంది. దీంతో అందులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన భక్తులను హుటాహుటిన తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు వేగం మరింత పెరిగి ఉంటే గ్రిల్స్‌ను దాటి పిట్టగోడను ఢీకొని అటువైపుగా అటవీ ప్రాంతంలో పడిపోయే ఉండేదని టిటిడి సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments